
By - Vijayanand |28 Jun 2023 5:11 PM IST
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యపేట జిల్లా మోతే మండలంలో కొనసాగుతుంది. హుస్సేన్బాద్, మామిళ్ళగూడెం మీదుగా సాగుతుంది. ఈ సందర్భంగా భట్టి పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో సూర్యపేట జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. ఇక ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com