By - Vijayanand |9 Aug 2023 10:03 AM GMT
కాంగ్రెస్, బీఆర్ఎస్ బంధం విడదీయరానిదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ ఆరోపించారు. కవితపై ఉన్న కేసుల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గల్లీలో, ఢిల్లీలో కలిసి నడవడమే ఈ పార్టీలకు తెలుసని ఎద్దేవా చేశారు. కేకే, నామాలు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రం మొత్తాన్ని రాష్ట్ర సర్కార్ మత్తులో ముంచింది అని విమర్శించారు. మద్యంపై ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుందని అన్నారు. ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం కొద్ది నెలల్లోనే ఉందని NVSS ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com