
By - Chitralekha |24 July 2023 2:46 PM IST
మాజీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్లమెంటులోని హోంమంత్రి కార్యాలయంలో వీరిద్దరు సమావేశం అయ్యారు. బీజేపీ తెలంగాణ చీఫ్గా వైదొలిగిన తర్వాత తొలిసారిగా అమిత్షాతో భేటీ అయ్యారు బండి. తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. గత కొంతకాలంగా కేంద్ర కేబినెట్లోకి బండి సంజయ్ను తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. మరోవైపు అధిష్టానంకు ఫిర్యాదులు మానుకోవాలని,రాష్ట్ర అధ్యక్షుడిని స్వేచ్చగా పనిచేసుకోనివ్వాలని బండి సంజయ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com