
By - Vijayanand |20 Aug 2023 4:18 PM IST
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదవ రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన సీఐ పురుషోత్తంను సస్పెండ్ చేయాలంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసుల్ని ఇంట్లోకి రానీవ్వకుండా ఇంటి గేటు ఎదుట కార్యకర్తలు పెద్ద ఎత్తున బైటాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడి నుండి వెనుదిరిగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com