By - Bhoopathi |3 July 2023 8:15 AM GMT
గుంటూరు జిల్లా దాచేపల్లిలో క్షుద్రపూజల కలకలం రేగింది. నల్లకోడిని చంపి నడ్డిరోడు మీద పడేశారు గుర్తుతెలియని వ్యక్తులు. సంఘటనా స్థలంలో కత్తి, నిమ్మకాయలు, ముగ్గుపొడి ఉండటంతో దాచేపల్లి, గుత్తికొండ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. దాచేపల్లి బైపాస్ రోడ్డులో మోడల్ స్కూల్ ఉండటంతో పిల్లల్ని పాఠశాలకు పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. క్షుద్రపూజలు చేస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com