
By - Vijayanand |28 Jun 2023 5:55 PM IST
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో క్షుద్రపూజల కలకలం రేపాయి.అర్థరాత్రి మామిడి తోటలో క్షుద్రపూజలు నిర్వహించారు కొందరు నిర్వాహకులు.సినిమా సెట్టింగ్ తరహాలో సెట్టింగ్ ఏర్పాట్లు చేసి మరీ పూజలు చేశారు.దేవతా విగ్రహాలతో పాటు పసుపు, కుంకుమతో ముగ్గులతో 20 మంది బృందంగా ఏర్పడి క్షుద్రపూజల నిర్వహించారు.తమిళనాడు, తెలంగాణకు చెందిన రిజిస్ట్రేషన్లు కలిగిన..5 కార్లలో పెనుగంచిప్రోలు వచ్చిన 20 మంది పూజలు అనంతరం తమిళనాడుకు వెళ్లిపోయారు.అర్థరాత్రి పూజలు నిర్వహించడంపై స్థానికుల ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com