
By - Chitralekha |27 July 2023 12:30 PM IST
పల్నాడు జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతుంది. వినుకొండలో బోల్లా వర్సెస్ జీవీ రగడ కొనసాగుతుంది.నట్లు, బోల్ట్లు పోయాయని కేసు నమోదు చేయడంతో జీవీ ఆంజనేయులు,టీడీపీ నాయకులపై కేసులు పెట్టారు పోలీసులు.పోలీసుల వింత పోకడకు నిరసనగా టీడీపీ శ్రేణుల ర్యాలీ చేపట్టాయి.వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో టీడీపీ నిరసనకు దిగింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.ర్యాలీలో చేశారు.ర్యాలీ మధ్యలో కారులో వచ్చి ఎమ్మెల్యే బోల్లా హల్ చల్ చేశారు.దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com