BONALU: ప్లెక్సీల ఏర్పాటులో ఉద్రిక్తత

BONALU: ప్లెక్సీల ఏర్పాటులో ఉద్రిక్తత

హైదరాబాద్‌ మంగళహాట్‌లో బోనాల ప్లెక్సీల ఏర్పాటు విషయంలో గత రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. సంతోష్‌ గౌడ్, నరేందర్‌ గౌడ్‌ బోనాల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ఫ్లెక్సీలను తొలగించాలంటూ స్థానిక కార్పొరేటర్‌ శశికళ అనుచరులు వీరంగం సృష్టించారు. వారి ఇళ్లపై దాడులు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకోవడంతో.. పరిస్థితి సద్దుమణిగింది. ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Next Story