జగన్‌ సర్కార్ పై బోండ ఉమ ఫైర్‌

జగన్‌ సర్కార్ పై  బోండ ఉమ ఫైర్‌


జగన్‌ సర్కార్ పై టీడీపీ నేత బోండ ఉమ ఫైర్‌ అయ్యారు.సమగ్ర సర్వే పేరుతో లక్ష కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు.కొత్త విధానాలతో జగన్ ప్రభుత్వం దోచేస్తోందని,దాదాపు రెండు లక్షల ఎకరాలను నిషేధిత భూముల జాబితాలో పెట్టి..అధికారులతో బెదిరింపులకు చేయిస్తున్నారని అన్నారు.భూముల్ని 22ఏ చట్టం నుంచి తొలగించటం కోసం..సెటైల్మెంట్ ల పేరుతో కోట్లు కొట్టేశారని విమర్శించారు.22ఏ పరిధిలో ఉన్న భూములు అమ్ముకోవడం సాధ్యం కాదని అధికారులు బెదిరిస్తూ కారుచౌకగా వాటిని దోచేస్తున్నారని అన్నారు. అసలు 22ఏ లో 2లక్షల ఎకరాలు ఎందుకు పెట్టారో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Next Story