కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్పారంటూ నోటీసులు

కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్పారంటూ నోటీసులు

లోక్ సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అపద్దాలు చెప్పారంటూ స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది బీఆర్‌ఎస్‌. దూబే ఉద్దేశ పూర్వకంగా సభను తప్పుదారి పట్టించారన్నారు. రూల్ 222 కింద ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. నిన్న లోక్ సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం 86 వేల కోట్లు ఇచ్చిందని ప్రకటించారు నిషికాంత్ దూబే. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని.. సభను తప్పుదోవ పట్టించడమేనంటూ నోటీసులో పేర్కొన్నారు నామా

Next Story