నిజాం కాలేజీలో హాస్టల్‌, న్యూ కాలేజీ బ్లాక్‌లకు కేటీఆర్ శంకుస్ధాపన

నిజాం కాలేజీలో హాస్టల్‌, న్యూ కాలేజీ బ్లాక్‌లకు కేటీఆర్ శంకుస్ధాపన

హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ లో బాయ్స్‌ హాస్టల్‌, న్యూ కాలేజీ బ్లాక్‌ ను మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. యూనివర్సిటీల పరంగా తెలంగాణకు నాలుగవ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఓయూ అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. వర్సిటీ వీసీ రవీందర్ కూడా ఓయూ అభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రారంభించిన కార్యక్రమం బాగుందన్నారు.

Next Story