
By - Sathwik |22 Nov 2023 7:00 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BSP అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి రెండు రోజులు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న మాయావతి సూర్యాపేటలో జరగనున్న ర్యాలీ, బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభ అనంతరం హైదరాబాద్ చేరుకోని హోటల్లో బస చేస్తారనిముఖ్య నేతలతో ఆమె ప్రత్యేకంగా భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 107 స్థానాల్లో BSP అభ్యర్థులు బరిలో నిలిచిన దృష్ట్యా సింగిల్ డిజిట్ సీట్ల గెలుపు లక్ష్యంగా నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లిలో భారీ ర్యాలీ, బహిరంగసభలో ఆమె పాల్గొని ప్రసంగించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com