
By - Chitralekha |28 Aug 2023 11:32 AM IST
హైదరాబాద్ రామ్కోఠిలో మెడికల్ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. జీహెచ్ఎంసీ స్వీపర్ సునీతపైకి దూసుకెళ్లింది. దీంతో పారిశుద్ద్య కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అయాన్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్స్ కళాశాలకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న నారాయణ గూడ పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సు ను సీజ్ చేసిన పోలీసులు, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com