లారీ ఢీకొట్టడంతో పల్టీ కొట్టిన కారు

లారీ ఢీకొట్టడంతో పల్టీ కొట్టిన కారు

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామం దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సడెన్ బ్రేక్ వేయడంతో కారును వెనక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. లారీ ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టింది. కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్షతగాత్రులను ఆస్పత్రి తరలించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ప్రమాదానికి గురైంది నల్గొండ జిల్లా గుండ్లపల్లి వాసులుగా గుర్తించారు.

Next Story