AP: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ

AP: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జై భారత్‌ నేషనల్‌’ (JBNP) పేరిట కొత్త పార్టీని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. జాతీయ జెండా రంగులతో జేడీ ఫొటో ఉన్న పార్టీ జెండా ఆవిష్కరించారు. సమస్య పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేడ్కర్ చెప్పారన్న లక్ష్మీనారాయణ ...ఆ దిశగానే అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే పార్టీ స్థాపించానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్‌ నేషనల్‌ పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. వరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించానని... అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు.. బానిసత్వాన్ని రూపుమాపేందుకు పుట్టిందే జేబీఎన్‌పీ అని లక్ష్మీనారాయణ తెలిపారు.

Next Story