By - jyotsna |13 March 2024 11:45 PM GMT
కుక్కలను ప్రాణప్రదంగా పెంచుకునే వారికి కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. పిట్బుల్ టెర్రీర్, అమెరికన్ బుల్డాగ్, రాట్వీలర్, మాస్టివ్స్, షెపర్డ్ తదితర 23 జాతుల(బ్రీడ్స్)కు చెందిన కుక్కలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది. వాటి దాడి వల్ల మనుషులు చనిపోతుండటంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు మార్చి 12న కేంద్ర పశుసంవర్ధకశాఖ ఆదేశాలు జారీచేసింది. జాబితాలోని 23 జాతుల కుక్కల అమ్మకాలను, వృద్ధి(బ్రీడింగ్)ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సదరు కుక్కలకు సంబంధించి లైసెన్సులు జారీ చేయకూడదని ఆదేశించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com