
By - Sathwik |27 Sept 2023 9:00 AM IST
ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో రెండేళ్ల క్రితమే నమోదైన స్కిల్ కేసును మళ్లీ ఓపెన్ చేశారని... కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ.నారాయణ స్వామి అన్నారు. గతంలో చంద్రబాబు పేరు F.I.Rలో లేకపోయినా.. కొత్తగా చేర్చినట్లు విన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు చర్యలు లేవని తాను చెప్పలేనని... అయితే వివాదం కోర్టులో ఉన్న కారణంగా రాజకీయంగా మాట్లాడలేని నారాయణ స్వామి బదులిచ్చారు. చార్జ్ షీట్ ఎలా వేశారో... ఎందుకు అరెస్ట్ చేశారో.. ఆయన పేరు ఎలా వచ్చిందో తనకు తెలీదన్నారు. ఏపీలో కక్ష సాధింపు లేదని తాను చెప్పలేను అంటూ పరోక్షంగా జగన్కు చురకలంటించారు. వివాదం కోర్టులో ఉన్న కారణంగా తాను రాజకీయంగా మాట్లాడలేనని నారాయణ స్వామి పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com