ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పష్టత

ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పష్టత

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడి హైకోర్టు అభిప్రాయాలు తెలపాల్సి వుందని పేర్కొంది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిస్తూ.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర హైకోర్టును సంప్రదించి తరలింపు నిర్ణయాన్ని ఆ ప్రభుత్వమే తీసుకోవాల్సివుంటుందని మంత్రి వెల్లడించారు .

Next Story