
By - Chitralekha |17 Aug 2023 2:19 PM IST
ఏపీ విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ చేపట్టిన ఛలో విద్యుత్ సౌధ నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. డాక్టర్ NTTTPS పాత గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాంట్రాక్ట్ కార్మికుల తమ డిమాండ్ల పరిష్కరించాలంటూ చలో విద్యుత్ సౌధకు పిలుపు నిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇంజినీర్ల సంఘం సంయుక్తంగా ఛలో విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com