YCPపై ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు విమర్శలు

YCPపై ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు విమర్శలు

వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు విమర్శలు చేశారు.రాష్ట్రంలో రోజుకో ఘోరం జరుగు తుందని,ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం కనిపిస్తోందని ఆరోపించారు.రోడ్డు అడిగిన కానిస్టేబుల్ ను సస్పెన్షన్ చేశారని,పెన్షన్ అడిగిన మహిళపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు.బకాయిలు చెల్లించాలన్నందుకు వైసీపీ గూండాలు..వస్త్ర వ్యాపారులపై అమానుషంగా దాడికి పాల్పడ్డారని,బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పడం మాత్రం ఖాయమన్నారు చంద్రబాబు.

Next Story