By - Sathwik |10 Dec 2023 2:00 AM GMT
వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన... రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అవసరం ఎంతో ఉందని గుర్తుచేశారు. అంతర్గతంగా చేయించిన సర్వేల్లో ఎవరి పనితీరు బాగాలేకపోయినా ఉపేక్షించేది లేదన్నారు. పనితీరు బాగాలేని వారిని ప్రత్యామ్నాయo చూపించి పక్కన పెడతానని, పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టేది లేదని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. ఓట్ల అవకతవకల విషయాన్ని నియోజకవర్గ ఇంఛార్జిలు బాధ్యతగా తీసుకుని పోరాడాలని... అన్నీ అధిష్టానం చూసుకుంటుందనే అలసత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దని స్పష్టంచేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com