
By - Vijayanand |18 Aug 2023 4:04 PM IST
అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన మహిళా ప్రగతి-ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో మహిళే ఆర్థికమంత్రిగా వ్యవహరించి....ఇల్లును చక్కదిద్దుతుందన్నారు. టీడీపీకి సంపద సృష్టించడం తెలుసన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా తమ హయాంలో మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశామన్నారు. ఆక్వా రంగాన్ని వైసీపీ నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఆరు నెలలు ఓపిక పడితే అధికారంలోకి వచ్చి ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com