
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్లో చంద్రబాబు కోరారు. చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దీంతో ఈనెల 18 వరకు కౌంటర్ దాఖలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇచ్చింది. ఆ గడువు పూర్తయిన నేపథ్యంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం నేడు తదుపరి విచారణ చేపట్టనుంది. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్పైనా విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్పైనా వాదనలు జరిగే అవకాశముంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com