
నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర మూడోరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగింది. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. మొదట రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత.... ఏర్పేడు మండలం మునగాలపాలెం వెళ్తుండగా వికృతమాల గ్రామ సమీపంలో TCL కంపెనీ ప్రతినిధులు భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోTCL ఏర్పాటైందని భువనేశ్వరికి వివరించియాత్రకు సంఘీభావం తెలిపారు. తర్వాత మునగాలపాలెం వద్ద ఇసుక అక్రమ నియంత్రణ పోరాటంలో అసువులు బాసినవారికి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వసంతమ్మ కుటుంబాన్నిశ్రీకాళహస్తి గ్రామీణ మండలం. పోలిలోని మునిరాజా కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని కుటుంబాలకూ3లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు. తర్వాత శ్రీకాళహస్తి సభలో పాల్గొన్న భువనేశ్వరి...వైకాపా పాలనలో ఏపీ..... రాజధాని కూడా లేని అనాథగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com