"మీరు తప్పుకుంటే.. వాళ్ల అంతు మేం చూస్తాం"

మీరు తప్పుకుంటే.. వాళ్ల అంతు మేం చూస్తాం


అన్నమయ్య జిల్లా అంగళ్లులో వైసీపీ బరితెగింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండించారు. పెద్దిరెడ్డీ... ఇవాళ్టి నుంచి రోజులు లెక్కపెట్టుకో అంటూ మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి పతనం అంగళ్లు నుంచే ప్రారంభమైందన్నారు. బాంబులకే భయపడలేదు… నాలుగు రాళ్లు వేస్తే భయపడతానా? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు... పోలీసులకు రోషం ఉంటే.. టీడీపీ కార్యకర్తల్ని కాదు.. వైసీపీని అడ్డుకోవాలన్నారు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని రావడం మగతనమా?.... మీరు తప్పుకుంటే.. వాళ్ల అంతు మేం చూసుకుంటామని గర్జించారు చంద్రబాబు.

Next Story