By - Sathwik |5 Nov 2023 1:15 PM IST
చంద్రబాబుకు మద్దతుగా సింగపూర్ లోని తెలుగుదేశం ఫోరం సభ్యులు పాదయాత్ర చేపట్టారు. ఆయన అవినీతి కేసు నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో ఉండాలంటూ... సీన్గాకాంగ్ వెల్మురుగన్ దేవాలయం నుంచి లిటిల్ ఇండియాలోని తిరుమల్ శ్రీనివాసం దేవాలయం వరకు 13కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.... 3వందల మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఫోరం సభ్యులంతా పాల్గొని చంద్రబాబుకు అంతా మంచి జరగాలని వెంకటేశ్వర స్వామివారిని కోరుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com