
By - Vijayanand |7 Aug 2023 10:35 AM IST
టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరానికి వెళ్తారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు పట్టిసీమకు చేరుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మీదుగా దేవరపల్లి చేరుకుని రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి రాజమహేంద్రవరంలో బస చేస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com