
By - Vijayanand |4 Aug 2023 2:12 PM IST
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది అధికార యంత్రాగం. పుంగనూరులో పోటాపోటీగా వైసీపీ, టీడీపీ నేతల ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ వైసీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. మరోవైపు పుంగనూరుకు వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ నేతల్ని పట్టించుకోని పోలీసులు కేవలం టీడీపీ నేతల్ని పుంగనూరుకు రాకుండా అడ్డుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com