
By - Vijayanand |5 Aug 2023 1:53 PM IST
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఫ్లెక్సీలు తొలగించాలని మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనుమతులున్నా ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తారని టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి రానున్నారు. అగ్రహారం రోడ్ ఏపీ సీడ్స్ సర్కిల్ వద్ద జరిగే రోడ్షోతో పాటు బేరివీధి మండపం వద్ద జరిగే పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు మాట్లాడుతారు. బాబు కార్యక్రమాల కోసం టీడీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తుండగా.. మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com