
By - Chitralekha |23 Aug 2023 12:31 PM IST
తెలంగాణ సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను నేటి నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం గణపతి పూజతో వివిధ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పుణ్యహవాచనం, యాగశాల శుద్ధి, గోపూజ, ఆవాహిత గణపతి హోమం చేయనున్నారు. 24న ఉదయం 9 గంటలకు స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, మహాస్నపనం, వేద పారాయణం, మహాలక్ష్మీ యాగం, మహా మంగళహారతి కార్యక్రమాలను చేపడుతారు. 25న ఉదయం చండీయాగం తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com