By - Chitralekha |29 July 2023 8:22 AM GMT
ఖమ్మం జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.వైరా నుంచి భద్రాచలం వరకు వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యం వల్లే పలువురు మరణించారని అన్నారు.పాలనను గాలికి వదిలేశారని,ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ అవసరాలకు వాడుకోవడం వల్లే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com