
By - Vijayanand |25 Aug 2023 1:12 PM IST
విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో గో బ్యాక్ సీఎం అంటూ నినాదాలు చేశారు. నాలుగేళ్ల పాటు కాలయాపన చేసి ఎన్నికలు సమీపిస్తున్న వేళ శంకుస్థాపనలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకుండా శంకుస్థాపన ఎలా చేస్తారంటూ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com