
By - Subba Reddy |15 Jun 2023 10:30 AM IST
నేడు సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాగపూర్కి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో తొలి కార్యాలయం ప్రారంభంకానుంది. కాగా.. ఇప్పటికే ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించింది. తాజాగా మహరాష్ట్రలోని నాగపూర్లో కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. త్వరలో ముంబై, పూణె, ఔరంగాబాద్తోపాటు నాందేడ్ నగరాల్లోనూ కార్యా లయాలను ఏర్పాటు చేయనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com