
By - Vijayanand |7 Aug 2023 9:39 AM IST
శాసనసభ వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండాలు పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. తెలంగాణను నిండా ముంచిన కాంగ్రెస్ నేతలా తమకు నీతులు చెప్పేది అంటూ ఫైర్ అయ్యారు. ఎవరేం చేసినా తెలంగాణలో మళ్లీ అధికారం తమదేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సీట్ల కంటే ఆరేడు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పారు.ఎంఐఎం ఎప్పటికీ మాకు ఫ్రెండ్లీ పార్టీనేనని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com