
By - Chitralekha |23 Aug 2023 3:17 PM IST
సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన నేపథ్యంలో విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలతో మెదక్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడించారు. అటు.. సీఎం పర్యటనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. బైక్ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదానికి దిగారు. తోపులాట కూడా చోటు చేసుకుంది. వీరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల తంటాలు పడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com