By - Vijayanand |7 July 2023 6:57 AM GMT
బాపట్ల జిల్లాలో పేదల షాపులు తొలగింపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాపట్లలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే కోన రఘుపతి స్థలానికి దారి కోసం... బాబురావు అనే వ్యక్తికి చెందిన రెండు షాపులు తొలగించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే స్వార్థం కోసం తమ షాపులను అన్యాయంగా తొలిగించారని బాధితులు కన్నీరుమున్నీరువుతున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్న బాధితులు చెప్పారు. తాము 40ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని.. తమకు న్యాయం చేయాలని బాధితుల వేడుకుంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com