మంత్రి పెద్దిరెడ్డిపై కేంద్రమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు

మంత్రి పెద్దిరెడ్డిపై కేంద్రమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలపై కేంద్రమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి 60కి పైగా సూట్‌కేసు కంపెనీలు సృష్టించారని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌ ఆరోపించారు. అన్ని రకాలుగా అక్రమాలు చేసి వేల కోట్లు దోచుకుంటున్నారని, 2019కి ముందు పెద్దిరెడ్డి ఆస్తులు 2019 అఫిడవిట్‌లో ఆస్తులను పేర్కొనలేదని చెప్పారు. ఎన్నికల సంఘాన్ని మోసం చేసిన పెద్దిరెడ్డిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దుర్వినియోగంపై కూడా అమిత్‌ షాతో మాట్లాడినట్లు రామచంద్రయాదవ్‌ తెలిపారు.

Next Story