
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్ , బల్మూరి వెంకట్ ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఇద్దరికి పోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు అభ్యర్ధులు నిర్దారించారు. అయితే... అధికారికంగా అభ్యర్ధుల ఎంపికపై ప్రకటన ఏఐసీసీ ఇవ్వాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద..... ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరిగినా... చివరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ , NSUI తెలంగాణ అధ్యక్షుడు బలమూరి వెంకట్ లకు.... పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఈనెల 18వరకు నామనేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉండగా ఆలోపు ఇద్దరూ పత్రాలు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా ఉన్నందున శాసనసభలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్ కే రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com