
By - Bhoopathi |5 July 2023 1:30 PM IST
బీజేపీలో అసంతృప్తులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ఇప్పటికే హస్తం పార్టీ టచ్లోకి పలువురు కమలం నేతలు వచ్చినట్లు చెబుతున్నారు. ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి చెందిన ఒక మహిళా ముఖ్యనేతతో కర్ణాటక మంత్రి బోసురాజు సంప్రదింపులు జరుపుతున్నారట. ఇప్పటికే సదరు మహిళా నేత ముఖ్య అనుచరులు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. అటు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com