హైకోర్టులో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిటిషన్

హైకోర్టులో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిటిషన్

ఖమ్మంలో తన భూములను ప్రభుత్వం సర్వే చేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీనిపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ఇవాళ విచారణ చేపట్టనుంది. ఎస్సార్ గార్డెన్ లో 20 గుంటల భూమి ఉందంటూ అధికారులు సర్వే చేయడంపై ఈ పిటీషన్ దాఖలు చేశారు. 13 ఏళ్ల క్రితం గార్డెన్ నిర్మించామని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా.. భూముల్ని సర్వే చేసిందన్నారు పొంగులేటి.


భూకబ్జా ఆరోపణలపై స్పందించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తన లాంటి వ్యక్తి 20 గుంటలు కబ్జా చేశానని నింద మోపడం దారుణమన్నారు. తమ కుటుంబానికి అక్కడ 130 ఎకరాల భూమి ఉందన్నారు. BRSలో ఉంటే ఒక న్యాయం వేరే పార్టీలోకి వెళ్తే ఒక న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు సెలవులు చూసి ఇబ్బందులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. 14 సంవత్సరాల నుండి లేని ప్రాబ్లం ఇప్పుడేలా వచ్చిందని ప్రశ్నించారు. ఖమ్మం సభ సక్సెస్ అయ్యిందనే ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోందన్నారు. న్యాయ స్థానం ద్వారా పోరాటం చేస్తానన్నారు పొంగులేటి

Next Story