
By - Chitralekha |29 July 2023 4:13 PM IST
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పూచిక పుల్లతో సమానంగా తండ్రీ, కొడుకులు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ బర్త్ డే పార్టీల్లో మునిగిపోయారని విరుచుకుపడ్డారు. మున్సిపల్ శాఖ మంత్రిని ఉరేసినా తప్పు లేదని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com