By - Chitralekha |24 July 2023 10:42 AM GMT
కేసీఆర్, మోదీ ఒక్కటేనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి. కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్న కేసీఆర్.. 2020 వరకు ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ను మించిన నాయకుడు లేరన్నారు. దళితులకు మూడెకరాలు, సబ్ప్లాన్ విషయంలో కేసీఆర్ మోసం చేశారని అన్నారు. బీసీ బంధు, దళితబందుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com