
By - Sathwik |3 Dec 2023 12:30 PM IST
ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహిస్తున్నాయి. గాంధీభవన్ కి పెద్దసంఖ్యలో వచ్చినకార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబురాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసించారన్న నేతలు.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారం చేపడతామన్ని స్పష్టం చేస్తున్నారు. రెండుసార్లు అధికారం ఇచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంటివద్దకు పెద్దసంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు నిర్వహిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com