
By - Vijayanand |1 Sept 2023 2:04 PM IST
ఈనెల 16,17 తేదీల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది.2 రోజుల పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు హైదరాబాద్లోనే ఉండనున్నారు. సోనియా, రాహుల్, ఖర్గేతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. మరోవైపు ఈనెల 17న కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్ఎస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్గాంధీ హాజరు కానున్నారు.తెలంగాణ కోసం కాంగ్రెస్ త్యాగాలను వివరించడంతో పాటు, కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com