Hyderabad: ట్యాంక్‌బండ్‌ వద్ద కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

Hyderabad: ట్యాంక్‌బండ్‌ వద్ద కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ విగ్రహం ఎదుట కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పరీక్ష ఫలితాలు వెల్లడించాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జీవో 46కు మద్దతు తెలిపారు. జీవో 46తో అన్ని జిల్లాల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్నా రు. ఫలితాలు విడుదలయ్యే సమయంలో.. ఉద్యోగాలు రాకుండా కొంత మంది కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. తక్షణమే స్టేల్‌ లెవల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జోక్యం చేసుకుని ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Next Story