
By - Sathwik |17 Feb 2024 7:45 AM IST
నల్గొండలో 3 లక్షలు లంచంతీసుకుంటూ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చునాయక్... ఏసీబీకి చిక్కారు. ఆస్పత్రిలో 'బై హ్యాండ్' ఔషధాల టెండర్ కి అనుమతిచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్టు.... గుత్తేదారు తెలిపారు. టెండర్ కావాలంటే ప్రతిదానిలో 10 శాతం కమిషన్ కావాలని సూపరింటెండెంట్ డిమాండ్ చేయగా ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. గత నవంబర్ నుంచి కమిషన్ మరింత కావాలని డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించినట్లు వివరించారు. సూపరింటెండెంట్ అడిగిన మొత్తాన్ని బాధితుడు అందిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com