
కేశినేని నాని వైకాపా కోవర్టని తెలిపోయిందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడే మాటల్లో కేశినేనికి కూడా భాగం ఉందని తేలిపోయిందన్నారు. వెలంపల్లికి అనుకూలంగా పనిచేయడానికే..విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నారని వెంకన్న విమర్శించారు. చంద్రబాబు మాటపై గౌరవంతో ఇన్నాళ్లు నానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇప్పడు ఆయన నిజస్వరూపం అందరికీ తెలిసిందన్నారు. అలాగే కేశినేని కుటుంబంలో కలహాలతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత కేశినేని చిన్నీ తెలిపారు. మా కుటుంబంలో సమస్యలు దశాబ్దాలుగా ఉన్నాయని ఆయన వివరించారు. ఎంపీ టిక్కెట్ ఇచ్చి రెండుసార్లు ఆదరించిన నందమూరి, నారా కుటుంబాలను విమర్శించే స్థాయి కేశినేని నానికి లేదని ఆయన మండిపడ్డారు. అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ చెంతకు నాని చేరడాన్ని విజయవాడ ప్రజలు హర్షించరన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com