
By - Chitralekha |31 July 2023 3:56 PM IST
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో నాటుబాంబుల కలకలం రేగింది. యలమంచిలి చౌరస్తా డేపులమెట్ట వద్ద నాటుబాంబు పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు మల్లేష్, చిన్నవాడు, రోహిణి రావులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరు మూలపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అడవి పందుల్ని తరిమేందుకు రైతు సింహాచలం పొలంలో నాటు బాంబులు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రైతు సింహాచలంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com