By - Bhoopathi |18 Jun 2023 5:15 AM GMT
చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులపై దాడి చేసిన 8మందిని నంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్ గ్రామానికి చెందిన శ్యామల, యాదయ్యలపై గ్రామస్తులు దాడి చేశారు. చేతబడి చేస్తున్నారన్న నెపంతో దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టారు గ్రామస్తులు. చెట్టుకు తలకిందులుగా కట్టేసి చావబాదారు. తప్పించుకుని మరో వ్యక్తి పారిపోయాడు. ఓ మంత్రగాడు చెప్పిన మాటలు విని ఆ దంపతులపై గ్రామస్తులు తమ ప్రతాపం చూపించారు. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే వెలేస్తామని బాధితులను బెదిరించారు. విషయం తెలుసుకుని ఆ దంపతులను రక్షించారు పోలీసులు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com