BANDAR: రోజాపై వ్యాఖ్యల కేసులో బండారుకు బెయిల్‌

BANDAR: రోజాపై వ్యాఖ్యల కేసులో బండారుకు బెయిల్‌

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి బెయిల్‌పై విడుదలయ్యారు. రూ.25 వేల పూచీకత్తుతో బండారుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండారుపై నగరపాలెం పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నెల 2న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం బండారును మొబైల్‌ కోర్టులో హాజరుపర్చగా పూచీకత్తుతో మొబైల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

బెయిల్‌పై విడుదలైన అనంతరం బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. ధర్మం గెలుస్తుంది. న్యాయం గెలుస్తుంది. చంద్రబాబు కూడా త్వరగా బెయిల్‌ రావాలని కోరుకుంటున్నా అని అన్నారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం పట్ల తనకు గౌరవం ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానంలో న్యాయం జరిగిందని.. అరెస్టు చేసే సమయం నుంచి లోకేశ్‌ అండగా నిలిచారని తెలిపారు.

Next Story